కావలసిన పదార్థాలు:-
ఉప్పుడు బియ్యం - 3 కప్పులు,
జీలకర్ర - 1 టీ స్పూను,
అల్లం - అంగుళం ముక్క,
ఎండుమిర్చి - 4,
టమోటాలు - 3,
క్యారెట్ ముక్కలు - అర కప్పు,
బీట్ రూట్ ముక్కలు - 1 కప్పు,
ఉప్పు - రుచికి తగినంత,
నూనె - కాల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం:-
ఉప్పుడు బియ్యం 3గంటల పాటు నానబెట్టాలి.
మిక్సీలో జీలకర్ర, ఎండుమిర్చి, అల్లంతో పాటు నానిన బియ్యం వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత టమోటోలు, క్యారెట్, బీట్రూట్ ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకోని బియ్యం రుబ్బులో కలిపి ఉప్పుని జతచేయాలి.
ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలు పోసుకొని రెండువైపులా దోరగా కాల్చాలి. వేడి వేడిగా కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
