కావలసిన పదార్థాలు:-
చికెన్ - అరకేజి,
ఉల్లి తరుగు - 2 కప్పులు,
ఎండు మిర్చి - 2,
కాశ్మీరీ కారం (మార్కెట్లో దొరుకుతుంది) - ఒకటిన్నర స్పూను,
వెల్లుల్లి - 6 రేకలు,
అల్లం - అంగుళం ముక్క,
దనియాల పొడి - 1 టీ స్పూను,
జీలకర్ర - పావు టీ స్పూను,
యాలకులు - 6,
దాల్చిన చెక్క - 2 అంగుళాలు,
జీడిపప్పు -50 గ్రా.,
బాదం - 25 గ్రా.,
పెరుగు - 100 గ్రా.,
ఉప్పు - తగినంత,
నూనె - 2 టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర తరుగు - పావు కప్పు.
తయారుచేసే విధానం :-
చికెన్ ముక్కలకు ఉప్పు పట్టించి పక్కనుంచాలి.
కారం, దనియాల పొడి, కాశ్మీరీ కారం, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు విడివిడిగా వేగించి, అన్నీ కలిపి పొడి చేయాలి.
జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేగించి పొడి చేయాలి.
నూనెలో ఉల్లి, అల్లం, వెల్లుల్లి తరుగు వేగాక చికెన్ ముక్కలు వేసి సన్న మంటపై 5 నిమిషాలు ఉంచాలి.
మసాలపొడి, ఉప్పు కలిపి మరో రెండు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
తర్వాత జీడిపప్పు, బాదం పొడి కలపాలి.
పెరుగు కలిపి చిన్న మంటపై 5 నిమిషాలు ఉంచి, కొత్తిమీర చల్లి దించేయాలి.
ఈ కర్రీ రైస్, రోటీ, నాన్, బ్రెడ్తో బాగుంటుంది.
