కావలసినవి :-
మామిడిపండు గుజ్జు-రెండు కప్పులు,
బెల్లం తరుగు లేదా చక్కెర-ఒక కప్పు,
ప్లేటుకి రాయడానికి నెయ్యి-కొద్దిగా.
తయారీవిధానం:-
పాన్లో మామిడిపండు గుజ్జు, చక్కెర వేసి కలపాలి.
మిశ్రమం సగానికి వచ్చేదాకా సన్నని మంటపై ఉడికించాలి.
పెద్ద ప్లేటు లేదా ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానిపై నెయ్యి రాయాలి.
మామిడిపండు గుజ్జును ప్లాస్టిక్ షీట్ మీద పలచని పొరలా పరిచి బాగా మరగబెట్టాలి.
తర్వాత నచ్చిన ఆకారాల్లో కట్ చేసుకుని తింటే యమ్మీయమ్మీగా ఉంటాయి.
