పనీర్‌ ఎగ్‌ కర్రీ

కావలసిన పదార్థాలు :-
పనీర్‌ తురుము- ఒక కప్పు,
పసుపు- పావు టీ స్పూను,
కార్న్‌ఫ్లోర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు,
నూనె- వేగించడానికి సరిపడా,
బిర్యానీ ఆకులు- రెండు,
దాల్చిన చెక్క- ఒక అంగుళం ముక్క,
యాలకులు- ఒకటి,
లవంగాలు- మూడు,
జీలకర్ర- ఒక టీ స్పూను,
కారం- మూడు టీ స్పూన్లు,
తరిగిన ఉల్లిపాయ- ఒకటి,
అల్లం వెల్లుల్లి ముద్ద- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు,
పసుపు- అర టీ స్పూను,
ధనియాల పొడి- ఒకటిన్నర టీ సూన్లు,
జీలకర్ర పొడి- ఒక టీ స్పూను,
ఆమ్‌చూర్‌ పొడి- టీ స్పూను,
గరం మసాలా- అర టీ స్పూను,
ఉప్పు- తగినంత.
తయారీ విధానం :-
పనీర్‌ తురుమును రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి.
ఒక భాగం పనీర్‌లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని లడ్డూల్లా చేసుకోవాలి.
మిగిలిన సగం పనీర్‌ తురుములో కార్న్‌ఫ్లోర్‌ వేసి చపాతీల పిండిలా కలుపుకుని గుడ్డు ఆకారంలో మధ్యలో ఖాళీ ఉండేలా ఉండలు చేసుకోవాలి.
వీటి మధ్యలో లడ్డూల్లా చేసిన పనీర్‌ ఉండలను పెట్టి ఒక టేబుల్‌ స్పూను నూనెలో దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మరో బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె పోసి వేడెక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర వేసి వేగించాలి.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి మరో 5 నిమిషాలు వేగించాలి.
ఆ తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత ఆమ్‌చూర్‌ పొడి, పనీర్‌ గుడ్లను (మధ్యలో రెండు ముక్కలుగా కోసి) వేసి చిన్న మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించి దించేయాలి