కావలసిన పదార్థాలు:-
రొయ్యలు - అరకేజీ,
అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగులు - 1 టీ స్పూను చొప్పున,
సోయాసాస్ - 2 టీ స్పూన్లు,
కార్న్ఫ్లోర్ - అర టీ స్పూను,
కారం - 2 టీ స్పూన్లు,
పంచదార - అర టీ స్పూను,
వెనిగర్ - 1 టీ స్పూను,
ఉప్పు - రుచికి తగినంత,
రెడ్ ఫుడ్ కలర్ - చిటికెడు,
నూనె - 1 టేబుల్ స్పూను,
ఉల్లి, ఉల్లికాడ తరుగులు - అర కప్పు చొప్పున.
తయారుచేసే విధానం:-
రొయ్యల్ని శుభ్రం చేశాక చిన్న చిన్న ముక్కలుగా తరగి కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, సోయా సాస్, పంచదార, వెనిగర్, పుడ్ కలర్ పట్టించి గంటపాటు పక్కనుంచాలి.
కడాయిలో నూనె వేసి ఉల్లితరుగు దోరగా వేగాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తరుగు కూడా వేగించి రొయ్యల మిశ్రమాన్ని వేయాలి.
రొయ్యలు వేగాక ఉల్లికాడ తరుగు చల్లి రెండు నిమిషాల తర్వాత దించేయాలి.
చిల్లీ ప్రాన్స్ అన్నంతో నంజుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
