కావలసిన పదార్థాలు:-
చికెన్ (పెద్ద ముక్కలు) - 800 గ్రా.,
పచ్చికొబ్బరి తురుము - రెండు కప్పులు,
ఉల్లిపాయలు - 4,
కారం - 1 టీ స్పూను,
పసుపు - అర టీస్పూను,
గరం మసాల పొడి - 2 టీ స్పూన్లు,
పచ్చిమిర్చి - 4,
పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్టు - 3 టీ స్పూన్లు,
ఉప్పు - సరిపడా,
నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం:-
చికెన్ ముక్కలపై కత్తితో పొడుగ్గా గాటు పెట్టి, అల్లం మిశ్రమాన్ని కూరి గంటపాటు పక్కనుంచాలి.
కొబ్బరి తురుముని కొద్ది నూనెలో వేగించి, సగం ఉల్లి ముక్కలతో కలిపి పేస్టు చేసుకోవాలి.
నూనెలో మిగతా ఉల్లితరుగు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, గరం మసాల పొడి, కారం, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి.
ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి 10 నిమిషాలు (బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు) వేగించాలి.
తర్వాత ఉల్లి, కొబ్బరి పేస్టు, ఉప్పు వేసి 4 కప్పుల నీరు పోసి మూత పెట్టాలి. చికెన్ ఉడికి, నూనె తేలిన తర్వాత కొత్తిమీర చల్లాలి.
ఈ కర్రీ పలావ్, జీరారైసులతో బాగుంటుంది.
