ఆలు మిర్చీ బజ్జీ

కావలసిన పదార్థాలు:-
లావు మిర్చీలు - 5,
శనగపిండి - 100గ్రా.,
ఉప్పు - రుచికి తగినంత,
వాము - 3 గ్రా.,
కారం - 5 గ్రా.,
ఉడికించిన బంగాళదుంపలు -3,
ఎండు మామిడిపొడి - 3 గ్రా.,
జీరాపొడి -3 గ్రా.,
నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం:-
ఉడికించిన బంగాళదుంపల తొక్కతీసి మెదిపి అందులో కారం, జీరాపొడి, మామిడి పొడి వేసి బాగా కలిపి ముద్దలా చేసిపెట్టుకోవాలి.
మిర్చీలను నిలువునా మధ్యలోకి చీరి, గింజల్ని తీసేసి అందులో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టాలి.
ఇప్పుడు శనగపిండిలో ఉప్పు, వాము వేసి నీటితో చిక్కని జారుగా కలుపుకోవాలి.
మిర్చీలను శనగపిండి జారులో ముంచి ఒక మోస్తరు వేడిపై నూనెలో దోరగా వేగించుకోవాలి.
వేడివేడి మిర్చీ బజ్జీలు ఎంతో రుచిగా ఉంటాయి.
ఇష్టం ఉన్నవారు పుదీనా చట్నీతో తినవచ్చు.